పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 2ని తీసుకొచిన విషయం తెలిసిందే. ఈ జీవోను సర్పంచులు వ్యతిరేకించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ సందర్భంగా జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని సర్పంచులు వాదించారు. ఈ క్రమంలో సదరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఈ జీవోపై హైకోర్టులో మరోసారి విచారణ జరుగబోతున్న నేపథ్యంలో జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh: జీవో నెంబర్ 2ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

Template (11) Copy