ట్రాఫిక్ రద్దీ కారణంగానే ముంబైలో 3శాతం విడాకులు జరుగుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో రోడ్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. గతుకులు, గుంతలు కారణంగా తాను ప్రయాణిస్తున్న రోడ్ల పై ఇబ్బందులు ఎదుర్కొన్నానని అమృతా ఫడ్నవీస్ ఆన్నారు.
ఇక తాను సాదారణ పౌరురాలిగానే స్పందిస్తున్నానని, ట్రాఫిక్ రద్దీ కారణం ప్రజలు ప్రతిరోజు తమ కుటుంబాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, దీంతో చాలామంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారన్నారు. మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ పై అధికార మహా వికాస్ అఘాడీ పార్టీ నాయకులు తరచూ విమర్శలు చేస్తుంటారు. దీంతో ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలో ఈసారి అమృతా ప్రభుత్వంపై చేసిన విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి.