Bihar Accident: బీహార్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Bihar Accident: బీహార్ లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. పూర్నియాలోని కృత్యానంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇథనాల్ ఫ్యాక్టరీ సమీపంలో బస్సు, ఆటోరిక్షా ఢీకొన్నాయి. గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. భూ వివాదం కేసులో తాను పూర్ణియా కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాయని ఆ వ్యక్తి తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ పూర్ణియా మెడికల్ కాలేజీలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

Also Read: Jailer Box Office: కేరళలో రజనీ హవా, విక్రమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైలర్,