17 Labourers Dead : నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి.. 17 మంది కార్మికుల మృతి

17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 12:56 PM IST

17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతుండగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మృతిచెందారు.  పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also read : Chandrayaan 3 – 14 Days Life : 14 రోజులే లైఫ్.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ జీవితకాలం అంతే !!

ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద దాదాపు 40 మందికిపై కార్మికులు (17 Labourers Dead) పనిచేస్తున్నారని తెలిసింది. సాయిరంగ్ అనే ప్రాంతం ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మిజోరం ముఖ్యమంత్రి జోరం తంగా ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఘటనకు సంబంధించిన ఒక వీడియోను  ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.