17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతుండగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద దాదాపు 40 మందికిపై కార్మికులు (17 Labourers Dead) పనిచేస్తున్నారని తెలిసింది. సాయిరంగ్ అనే ప్రాంతం ఐజ్వాల్కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మిజోరం ముఖ్యమంత్రి జోరం తంగా ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఘటనకు సంబంధించిన ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress.
Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7
— Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023