మీరు పుట్టినరోజ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా..? చల్లని సాయంత్రం.. సాగరతీరం.. అలలపై బర్త్ డేను జరుపుకుంటే? చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా.. అలాంటి థ్రిల్స్ ను అందించడానికి తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందించనుంది. తెలంగాణ టూరిజం శాఖ హుస్సేన్ సాగర్ వద్ద క్రూయిజ్ సౌకర్యాన్ని అందిస్తోంది. క్రూయిజ్ కార్పొరేట్ బుకింగ్లు, వివాహాలు ఇతర సందర్భాల్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన సాయంత్రం, హైదరాబాద్ నడిబొడ్డున ప్రశాంతమైన వాతావరణంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవచ్చు. హైదరాబాద్ ను సందర్శించే పర్యాటకులు ఎవరైనా హుస్సేన్ సాగర్ సరస్సు విజిట్ చేయకుండా ఉండలేరు. సరస్సులో మధ్యలోకి వెళ్లి చూస్తే.. చుట్టు పరిసర ప్రాంతాల ప్రాంతాలు మిరుమిట్లు గొలుపుతాయి.
లుంబినీ పార్క్ నుంచి చక్కర్లు కొట్టే (48 సీట్స్ కలిగిన లాంచ్) క్రూయిజ్ లో డిన్నర్ చేసేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసి ఉంటాయి. బర్త్ డే వేడుకలతో పాటు ప్రైవేట్ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవచ్చు. చల్లని సాయంత్రం సమయంలో ఇష్టమైన స్నేహితుల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేస్తూ, స్వీట్ మెమోరీస్ ను సొంతం చేసుకోవచ్చు. నలుగురు లేదా ఐదుగురు స్నేహితులు గ్రూప్ గా ఏర్పడి స్లాట్ బుక్ చేసుకుంటే హుస్సేన్సాగర్ లో అలల మధ్య ఎంజాయ్ చేస్తూ పుట్టినరోజు వేడుకలతో పాటు ప్రైవేట్ పార్టీలు జరుపుకోవచ్చు. ఇతర వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్ను విజిట్ చేయండి.
https://tourism.telangana.gov.in/boating/CruiserAtHussainSagar