Karnataka 2023: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై లోక్ పాల్ లేటెస్ట్ స‌ర్వే

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల (Karnataka 2023) మీద లోక్ పాల్ స‌ర్వే సంచ‌ల‌నంగా మారింది.

  • Written By:
  • Publish Date - April 18, 2023 / 06:02 PM IST

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల (Karnataka 2023) మీద లోక్ పాల్ (Lokpal survey)స‌ర్వే సంచ‌ల‌నంగా మారింది. ఆ స‌ర్వే సంస్థ మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు ప‌బ్లిక్ మూడ్ ను అంచ‌నా వేసింది. సుమారు 65వేల శాంపిల్స్ తో ఈ సర్వేను చేసింది. కాంగ్రెస్ ఒంట‌రిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని తేల్చింది. అయితే, తాజాగా రాహుల్ గాంధీ రిజ‌ర్వేష‌న్ల పై ఇచ్చిన హామీ ఆ పార్టీ కొంప ముంచ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్ల ప‌రిమితిని పూర్తిగా ఎత్తివేస్తామ‌ని రాహుల్ ప్ర‌క‌టించారు. ఇక నుంచి జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసేలా తొలి సంత‌కం కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెడుతుంద‌ని సంచ‌ల‌న హామీ ఇచ్చారు. దీంతో ఫ‌లితాలు తారుమారు అవుతాయ‌ని కాంగ్రెస్ పెద్ద‌ల్లో గుబులు బ‌య‌లు దేరింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల  మీద లోక్ పాల్ స‌ర్వే (Karnataka 2023)

కర్ణాటక ఎన్నికలు (Karnataka 2023)సమీపిస్తున్న వేళ ప్ర‌తి అంశం కూడా ముఖ్య‌మైన‌దే. ఆ రాష్ట్రానికి మే 10న అక్కడ పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ తగ్గడం లేదు. బిజెపి దూకుడు తగ్గించడం లేదు. మధ్యలో కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి పార్టీ భావిస్తోంది. ఇలాంటి క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఐదేళ్లపాటు కన్నడ రాజ్యాన్ని ఏలుతుంది? అనే ప్రశ్నలకు లోక్ పాల్ 2.0 సర్వే(Lokpal survey) క్లియర్ పిక్చర్ ఇచ్చింది.

కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి

ఇప్పటికే కర్ణాటక ఎన్నికలకు (Karnataka 2023) సంబంధించి ఏబీపీ_ సీ ఓటర్ సర్వే ఫలితాలు వచ్చాయి. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని తేలిపోయింది. తాజాగా లోక్ పాల్ 2.0 సర్వేలోనూ(Lokpal survey) కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని తేలిపోయింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేరువేరుగా ఈ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. అధికార భారతీయ జనతా పార్టీ తన స్థానాల సంఖ్యను ఫిబ్రవరి తో పోలిస్తే మార్చిలో మరింత ఎక్కువ కోల్పోయింది. మరోవైపు కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనే అంచనాలు కూడా తలకిందయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 లోక్ పాల్ సర్వే ఫలితాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో ప్రతిబింబించలేదు

లోక్ పాల్ సర్వే (Lokpal survey)ప్రకారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య ఫిబ్రవరి నెలలో 116 నుంచి 122 దాకా ఉన్నాయి. అదే మార్చినాటికి ఆ సంఖ్య 131కి పెరిగింది. దీంతోపాటు ఓటు షేరింగ్ మూడు శాతం పెంచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీకి ఫిబ్రవరిలో 77 నుంచి 83 సీట్లు వస్తాయని పేర్కొనగా, మార్చిలో ఆ సంఖ్య 69 కి పడిపోయింది. ఓటు బ్యాంకు లోనూ మతం తరుగుదల నమోదయింది. ఇక కుమారస్వామి పార్టీకి ఫిబ్రవరిలో 27 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. మార్చిలో మాత్రం ఆ సంఖ్య 25 వరకే ఉంటుందని తేలిపోయింది. ఇక ఇతరుల సీట్లు ఫిబ్రవరిలో నాలుగు వరకు అంచనా వేయగా.. మార్చి నెలలో ఆ సంఖ్య రెండు కు పడిపోయింది.

Also Read : Karnataka 2023 : క‌ర్ణాట‌క కాంగ్రెస్ కు NCP, MIM పోటు

వాస్త‌వంగా లోక్ పాల్ సర్వే ఫలితాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో ప్రతిబింబించలేదు. ఈ సంస్థ అక్కడి ఎన్నికల్లో సర్వే నిర్వహించినప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లోనూ(Karnataka 2023) ఇదే ట్రెండ్ కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతుండగా.. తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Karnataka Congress: కర్నాటక ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ నేతలు!