Bus Journey: తమిళనాడు చెన్నైలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.చెన్నైలోని వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడుమధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ మహిళ ప్రయాణించింది. బస్సు చివర్లోని 59వ సీట్లో కూర్చుంది. అయితే, బస్సు అమింజికరై సమీపంలోకి రాగానే సదరు మహిళ తను కూర్చున్న సీటు నుంచి పైకి లేచింది.
ఆ సమయంలో బస్సు ఫ్లోర్ అకస్మాత్తుగా కూలి పెద్ద రంధ్రం పడింది.దీంతో ఆ మహిళ కూడా రంధ్రం గుండా పడిపోయింది.అప్రమత్తమైన తోటి ప్రయాణికులు డ్రైవర్కు సమాచారం అందించడంతో బస్సును ఆపేశారు. అదృష్టవశాత్తూ ఆ మహిళ చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.