Jayalalitha Jewellery : తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వజ్రాభరణాల పెట్టెలు ఎవరివి ? అవి ఎవరికి దక్కుతాయి ? అనే దానికి సంబంధించి బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ బంగారు ఆభరణాలను తమిళనాడు రాష్ట్ర సర్కారుకు అప్పగించేందుకు కోర్టు ఒక డేట్ను ఫిక్స్ చేసింది. ఆ ఆభరణాలను తీసుకోవడానికి మార్చి 6,7 తేదీల్లో 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును విచారించిన బెంగళూరులోని సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి.. మార్చి 6,7 తేదీలలో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join
జయలలితకు చెందిన బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించామని జడ్జి వెల్లడించారు. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకొని ఆభరణాలను(Jayalalitha Jewellery) తీసుకెళ్లాలని సూచించారు. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలని నిర్దేశించారు. ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.5కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్ల డీడీని కర్ణాటక సర్కారుకు ఇదివరకే అందించింది. అయితే, ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ కాలేదు.
అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014 సంవత్సరంలో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.
ఈ ఆభరణాలు ఎక్కడివి ?