మనలో చాలామంది డబ్బును పెట్టుబడికింద పెట్టి ఎక్కువ డబ్బు ను పొందాలనుకుంటారు. మీరు కూడా మీ డబ్బులను ఆవిధంగా సేవ్ చేసుకుని ఒకేసారి రెట్టింపుగా పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. గ్యారెంటీ రిటర్స్న్ ను కల్పించేందుకే ఈ స్పెషల్ సేవింగ్స్ స్కీమ్. ఈ స్పెషల్ స్కీమ్ ను పోస్టాఫీస్ ద్వారా అందిస్తున్నారు. అదే కిషాన్ వికాస్ పత్ర. దీన్ని వడ్డీరేటు ఏడాదికి 6.9 శాతంగా ఉంటుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల కంటేనూ ఇది ఎక్కువగా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్ర స్కిం ద్వారా మనం డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.
ప్రస్తుత వడ్డీరేటు ప్రకారంగా చూసినట్లయితే…పది సంవత్సరాల నాలుగు నెలల్లో అంటే 124 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే…124 నెలల్లో అవి 2లక్షలు అవుతాయి.
ఇవాళ పథకంలో డిపాజిట్ చేస్తే అవి 124 నెలల్లో మెచ్యూర్ అవుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లోనూ ప్రీమెచ్యూర్ విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కనిష్టంగా రూ. 1000 ఆ తర్వాత రూ. 100 గుణకాలలో కూడా డిపాజిట్ చేసుకునే వీలు ఉంటుంది. ఒకవేళ్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఈ అకౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తారు. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. అకౌంట్ హోల్డర్ మరణిస్తే…జాయింట్ అకౌంట్ హోల్డర్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు.