Actress Pavithra :ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ వారిపై సైబర్ క్రైంకు పవిత్రా లోకేశ్ ఫిర్యాదు…!!

  • Written By:
  • Updated On - November 29, 2022 / 11:18 AM IST

సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సినీనటి పవిత్రా లోకేశ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ కొన్ని టీవీఛానెల్స్, వెబ్ సైట్స్ పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ..తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆరోపించారు.

తెలుగు, కన్నడ, మలయాళంలోని పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది పవిత్రా లోకేశ్ . అయితే కొన్నాళ్ల క్రితం నరేశ్ పవిత్రా లోకేశ్ పెళ్లి వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వివాదం ఇంకా సమసిపోనప్పటికీ వీరిద్దరు మాత్రం కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి బంధంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజు నరేశ్ అందరికి చిరాకు తెప్పించే పనుల చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

సెలబ్రిటీలతో నరేశ్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నరేశ్ ప్రవర్తన కుటుంబీకులకు ఏమాత్రం నచ్చలేదన్నట్లు సమాచారం. కాగా పవిత్రా లోకేశ్ కూడా అందరితోపాటు ఉండటం పట్ల వారి కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారని సమాచారం. ఈ విషాద సమయంలో ఆమెను నరేశ్ అందరికీ పరిచయం చేయడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించిందంటూ పలువురు మండిపడ్డారు.