మనిషి గురించి మనిషి ఆలోచించడమే గగనంగా మారిన కాలం ఇది.
ఇలాంటి టైంలోనూ ఓ వ్యక్తి ఆపదలో ఉన్న కుక్క గురించి ఆలోచించాడు.
దాని ప్రాణాలను నిలిపేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముంబైలోని ఒక రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన కు సంబంధించిన వీడియోను మేరి జాన్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వస్తుండగా పెద్దసంఖ్యలో ప్రయాణీకులు వేచిఉన్నారు. ఈ సమయంలో రైలు పట్టాలపై వీధి కుక్క తిరగడం గమనించిన ఓ వ్యక్తి ట్రాక్ పైకి దూకాడు. కుక్కను పట్టుకుని ప్లాట్ఫాంపై వేచిఉన్న ప్రయానికులకు అందించాడు. ఆపై ఆ వ్యక్తిని ప్రయాణీకులు ప్లాట్ఫాం పైకి లాగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. “ఇది ముంబై…ఈ వ్యక్తికి గౌరవం ఇవ్వండి” అనే క్యాప్షన్ తో మేరి జాన్ అనే యూజర్ ఇన్స్టాగ్రాంలో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలవుతోంది. ఇప్పటివరకూ 1.87 లక్షల వ్యూస్ వచ్చాయి.
జూలై 19న ఏం అయిందంటే?
జూలై 19న ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. సడన్గా అదే సమయానికి రన్వేపైకి కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ టేకాఫ్ చేయడానికి నిరాకరించింది దీంతో
మళ్లీ దిశను మార్చుకుని ఎగిరిపోయింది.