Indore : దొంగతనం చేశారన్న నెపంతో ఇద్దరు మైనర్లను వాహనానికి కట్టేసి..ఈడ్చుకెళ్లి..!!

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 07:14 AM IST

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డారన్న అనుమానంతో ఇద్దరు మైనర్లను కొందరు వ్యక్తులు పట్టుకున్నారు. వారిని లోడింగ్ వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లారు. వారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు…వారిని ఆసుపత్రికి తరలించారు. బడి చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్లను తాలిబానీ స్టైల్లో కొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ లోని చోయిత్రం కూరగాయల మార్కెట్లో ఇద్దరు మైనర్ బాలురులు కారులో నుంచి కొన్ని వస్తువులను బయటకు తీయడం కనిపించింది. వారిని గమనించిన కారు డ్రైవర్ …వారిద్దర్నీ పట్టుకుని అతికిరాతకంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడున్న స్థానికులు రికార్డు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ల పై దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ నిహిత్ ఉపాధ్యాయ తెలిపారు.