Rape Case : గురుగ్రామ్‌లో దారుణం.. మ‌త్తుమందు ఇచ్చి మ‌హిళా టెక్కీపై అత్యాచారం

గురుగ్రామ్‌లో దారుణం జ‌రిగింది. ఓ షాపింగ్ మాల్ పార్కింగ్ వద్ద మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం చేసిన

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 06:45 AM IST

గురుగ్రామ్‌లో దారుణం జ‌రిగింది. ఓ షాపింగ్ మాల్ పార్కింగ్ వద్ద మహిళా టెక్కీకి మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మహిళను జాబ్ కోసం ఇట‌ర్వూ ఉందంటూ ఆమెను పిలిచి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో అత్యాచార బాధితురాలు తాను ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం వెతుకుతున్నానని, తుషార్ శర్మ అనే వ్యక్తిని సంప్రదించానని, అతను ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని పేర్కొంది. గత శనివారం సహారా మాల్‌లో ఇంటర్వ్యూ సాకుతో ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె తన పత్రాలతో మధ్యాహ్నం 1 గంటకు మాల్‌కు చేరుకుని.. తుషార్ శర్మను కలుసుకుంది. ఆ త‌రువాత నిందితుడు ఆమెకు నీళ్లు అందించాడు. నీళ్లు తాగిన త‌రువాత ఆమె స్పృహ కోల్పోయిందని.. శర్మ తనను తన కారులోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని పోలీసుల‌కు చెప్పింది. ఆమెను మాల్ పార్కింగ్ ఏరియాలో వదిలేసి పారిపోయే ముందు జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పోలీసుల ఫిర్యాదులో పేర్కోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.తుషార్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మాల్ యాజమాన్యం నుంచి సీసీటీవీ ఫుటేజీని కోరిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.