Site icon HashtagU Telugu

Maha Kumbh Revenue : మహాకుంభ మేళాతో కాసుల వర్షం.. సర్కారుకు రూ.2 లక్షల కోట్ల ఆదాయం

100 Devotees

100 Devotees

Maha Kumbh Revenue : ఇవాళ ప్రారంభమైన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించనుంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక మేళా ద్వారా యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దాదాపు రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందట. మహా కుంభమేళా నిర్వహణ కోసం యూపీ సర్కారు రూ.7 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అంటే రూ.7వేల కోట్ల ఖర్చుతో ఏకంగా రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని యోగి సర్కారు సంపాదించబోతోందన్న మాట.

Also Read :Z Morh Tunnel : ‘జెడ్ -మోర్హ్’ సొరంగానికి మోడీ శ్రీకారం.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

తొలిరోజు సర్కారు ఖజానాకు  రూ.25వేల కోట్లు

ఇవాళ  మేళాలో తొలిరోజున దాదాపు రూ.25వేల కోట్ల ఆదాయం యూపీ సర్కారు ఖజానాలోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఏ లెక్కన చూసుకున్నా.. ఈ అంచనాలు నిజమవడం ఖాయమే. ఎందుకంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రయాగ్ రాజ్(Maha Kumbh Revenue) నగరంలోని గంగా,యమున,సరస్వతీ నదుల త్రివేణీ సంగమంలో ఏకంగా 60 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. రాత్రి వరకు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 35 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్‌కు వస్తారట. వారంతా వసతి కోసం, పూజా సామగ్రి కోసం, పూల కొనుగోలుకు, భోజనాల కోసం డబ్బులు ఖర్చు చేయనున్నారు. వాటి ద్వారా యూపీ సర్కారుకు, స్థానిక వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది.

ఏ వ్యాపారం ఎంత జరుగుతుంది ?

Also Read :Mahakumbh Day 1 : కొన్ని గంటల్లోనే 60 లక్షల మంది పుణ్యస్నానాలు.. మహా కుంభమేళాలో తొలిరోజు