Aero India : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన యుద్ధ విమానంలో ప్రయాణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు తయారు చేయడంపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు. అంతేకాక.. ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం మరచిపోలేని అనుభూతినిచ్చిందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపడం.. మరచిపోలేని అనుభూతినిచ్చింది. హెచ్ఏఎల్ స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ-36 'యశస్' అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ… pic.twitter.com/0uKdwqRLiE
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) February 11, 2025
Read Also: Graduate MLC Elections : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
విమానయాన, రక్షణ తయారీలో రోజురోజుకూ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు. ఈ ఏరో ఇండియా 2025లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) యొక్క పూర్తి స్థాయి ఇంజినీరింగ్ మోడల్ను ఆవిష్కరించారు. దీంతో భారతదేశం తన వైమానిక పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది.
ఇది దేశంలోని ఐదవ తరం ప్రధాన పోరాటాల కోసం దేశపు దేశీయ ఐదవ తరం స్టీల్త్ పోరాటానికి సంబంధించిన మొదటి బహిరంగ ప్రదర్శనగా గుర్తించబడింది. ADA అధునాతన నిర్ణయాధికారం కోసం AI-శక్తితో కూడిన ఎలక్ట్రానిక్ పైలట్, నిజ-సమయ పోరాట సమన్వయం కోసం నెట్సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్లు, మెరుగుపరచడం కోసం అంతర్గత వెపన్ బేతో సహా అత్యాధునిక సాంకేతికతలను AMCAలో ఏకీకృతం చేసింది.