Russian Woman Rape: దారుణం.. రష్యా మహిళపై హోటల్ సిబ్బంది అత్యాచారం

గోవాలోని కలాంగుట్‌ ప్రాంతంలో దారుణం జరిగింది.

  • Written By:
  • Updated On - December 4, 2022 / 01:35 PM IST

గోవాలోని కలాంగుట్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ హాటల్‌లో మద్యం మత్తులో నిద్రిస్తున్న రష్యా మహిళపై సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే నిద్రలోనుంచి మేల్కొని దీనిని గ్రహించిన సదరు మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

గోవా పర్యటనకు వచ్చిన రష్యాకు చెందిన ఓ మహిళ తన పర్యటనకు వెళ్లిన తొలిరోజే అత్యాచారానికి గురైంది. రష్యా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేపాల్ జాతీయులను అరెస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. నిందితులు గురువారం (డిసెంబర్ 01, 2022) కలాంగుట్‌లోని ఒక హోటల్‌లో 37 ఏళ్ల రష్యన్ మహిళపై అత్యాచారం చేశారు. నిందితులిద్దరూ హోటల్‌లో రూం బాయ్‌గా పని చేసేవారు.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఉత్తర గోవాలోని కలాంగుట్‌లోని ఒక హోటల్‌లో గురువారం (డిసెంబర్ 1, 2022) రష్యా మహిళపై అత్యాచారం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అత్యాచారం ఆరోపణలపై ఇద్దరు నేపాలీ యువకులను అరెస్టు చేశారు. వారిని షకీల్ అన్సారీ, సానుద్దీన్ అన్సారీగా గుర్తించారు. నిందితులిద్దరూ నేపాల్‌లోని బర్దియా నివాసితులని, వీరు ఒకే హోటల్‌లో రూం బాయ్‌లుగా పనిచేస్తున్నారని చెప్పారు.

గోవాకు చేరుకున్న తొలిరోజే మహిళపై దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి హోటల్‌లో బస చేసింది. గురువారం గోవా చేరుకున్న తర్వాత మహిళ వాకింగ్‌కు వెళ్లింది. గోవాలోని అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించిన తర్వాత, మహిళ సాయంత్రం తన హోటల్‌కు చేరుకుంది. హోటల్‌కు చేరుకున్న తర్వాత మహిళ మద్యం సేవించి తన గదిలో నిద్రపోయింది. ఆ సమయంలో మహిళ స్నేహితులిద్దరూ బయట ఉన్నారు.

మొదటి నిందితుడు రష్యా మహిళ గదిలోకి శుభ్రపరిచే సాకుతో ప్రవేశించి మహిళ మత్తును ఆసరాగా తీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉండడంతో ఆ మహిళకు ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే రెండవ నిందితుడు గదిలోకి ప్రవేశించాడు. అతను కూడా మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ మహిళ నిద్రలో నుంచి మేల్కొని కేకలు వేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.