ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలు బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన ప్రవక్త వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంటే, ఆమెకు మద్ధతుగా విశ్వహిందూపరిషత్ నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా జూన్ 16న నిరసన డేగా ప్రకటించింది. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యులు ఇస్తామిక్ పండితులు చెప్పేవేనంటూ నుపూర్ శర్మకు వీహెచ్ పీ ప్రతినిధులు అండగా నిలిచారు.
దేశంలో 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఇస్లామిక్ జిహాదీలు తరచూ శ్రీరాముడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వీహెచ్ పీ ఆరోపించింది. ప్రస్తుతం నుపూర్ శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతోన్న దాడులు కూడా జీహాదీలు చేస్తున్న పనిగా అభిప్రాయపడింది. ఘోరమైన దురాక్రమణలు, రాళ్లతో కొట్టడం, దహనం చేయడం హిందూ గృహాలు, వ్యాపారాలను దోచుకోవడం లాంటి నేరాలు ఎన్నో జీహీదీలు చేశారని దుయ్యబట్టారు. అమెరికాకు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. ఈ అతివాద జిహాదీ దాడులు హిందూ సమాజాన్ని ఆగ్రహానికి గురి చేశాయని తెలంగాణ వీహెచ్పీ అధ్యక్షుడు ఎం. రామరాజు అన్నారు.
హిందువుల జీవితాలను మరియు జీవనోపాధి లేకుండా చేయడానికి జీహాదీలు ఇలా హిందూ సమాజంపై ప్రత్యక్ష దాడికి దిగుతున్నారని ఆరోపించారు. దేశంలో ఇస్లామిక్ ఆధిపత్యాన్ని స్థాపించడం కోసం నుపూర్ శర్మ చేసిన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలపై ఇటీవల జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ & కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక చర్యలను ఖండిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు వీహెచ్ పీ మెమోరాండం కూడా సమర్పించింది.
మహమ్మద్ ప్రవక్తపై హిందుత్వ కార్యకర్తలు నుపూర్ శర్మకు మద్దతుగా వీహెచ్ పీ నిలవడం ఇదే మొదటి సందర్భం కాదు. బీహార్లోని అర్రాహ్లో హిందుత్వ ‘కార్యకర్తలు’ కూడా నుపుర్ శర్మకు మద్దతుగా సభ నిర్వహించారు. శర్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి వార్నింగ్ ఇస్తుండే ఒక వీడియో విడుదల చేశారు. “మేము 100 కోట్ల మందికి పైగా హిందూ సోదరులం. నుపుర్ శర్మను మీరు తాకలేరు. ఆమెకు ఏదైనా జరిగితే, 100 కోట్ల మంది హిందువులు మీపై ఆరోపణలు చేయడాన్ని మీరు తట్టుకోలేరు, ”అని స్పీచ్ ఇచ్చారు.