PM Modi: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించిందని, జమ్మూకశ్మీర్,లద్దాఖ్ సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది అని ప్రధాని మోదీ అన్నారు. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చిందని మోడీ అన్నారు.
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఆర్టికల్ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తామని, ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు.. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం ఆయన అన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
Also Read: Vaibhav: తెలుగులో గ్యాప్ తీసుకోలేదు.. వచ్చిందంతే- హీరో వైభవ్