Site icon HashtagU Telugu

Digital Banking: డిజిటల్ బ్యాంకింగ్‌ స్థిరమైన వృద్ధిలో నడిపిస్తుంది: ప్రధాని మోదీ

karnataka 2023

Bjp Pm Modi

2014కు ముందు ఉన్న ‘ఫోన్ బ్యాంకింగ్’ స్థానంలో ‘డిజిటల్ బ్యాంకింగ్’ కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. గత యూపీఏ హయాం గురించి ప్రస్తావిస్తూ.. ఫోన్ బ్యాంకింగ్.. కింద బ్యాంకులు ఎవరికి రుణాలు ఇవ్వాలి.. ఏ నిబంధనలు, షరతులకు సంబంధించి ఫోన్‌లో సూచనలు ఇవ్వబడ్డాయి.

75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డిబియు) దేశానికి అంకితం చేసిన అనంతరం పీఎం మోదీ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక ప్రగతి నేరుగా బ్యాంకింగ్ వ్యవస్థ బలంతో ముడిపడి ఉంటుంది. బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవల పంపిణీకి మాధ్యమంగా మారిందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) లీకేజీలను అరికట్టడానికి, పారదర్శకతను తీసుకురావడానికి సహాయపడిందని ప్రధానమంత్రి అన్నారు.

ప్రభుత్వం ఇప్పటివరకు డిబిటి ద్వారా రూ. 25 లక్షల కోట్లను బదిలీ చేసిందని, పిఎం-కిసాన్ పథకం కింద మరో విడతను సోమవారం బదిలీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. రూ. 2,000 చొప్పున మూడు సార్లు చెల్లిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2022-23లో భాగంగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం దేశంలోని అనేక జిల్లాల్లో 75 DBUలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు దేశంలోని ప్రతి మూలకు చేరేలా డీబీయూలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని 11 బ్యాంకులు, ప్రైవేట్ రంగంలో 12, ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంకు ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నాయి.