మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిరాక్పూర్-పాటియాలా హైవేపై ఉన్న ఖిజర్ఘర్ గ్రామం నుండి దేశ్ రాజ్(40) తన 7 ఏళ్ల కొడుకు అవేష్తో కలిసి రోడ్డు దాటుతుండగా మొదటి ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో దేశ్ రాజ్, అవేశ్ ఇద్దరూ చనిపోయారు.
తన భర్త, కొడుకుతో కలిసి లంగర్లో పాల్గొనడానికి వెళ్లారని, వారు తిరిగి వస్తుండగా, బానూరు వైపు నుండి వస్తున్న కారు తన భర్త మరియు కొడుకును ఢీకొట్టిందని దేశ్ రాజ్ భార్య తేజ్వతి పోలీసులకు తెలిపింది. గాయపడిన ఇద్దరినీ చండీగఢ్లోని GMCH, సెక్టార్ 32కి తరలించారు. అక్కడ వైద్యులు ఇద్దరూ చనిపోయినట్లు ప్రకటించారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్ యువరాజ్ను స్థానికులు పట్టుకున్నారు. యువరాజ్ను అరెస్టు చేసిన పోలీసులు IPC సెక్షన్ 304 A , 279 (ర్యాష్ డ్రైవింగ్) కింద కేసు నమోదు చేశారు
మరో సంఘటనలో అంబాలా నివాసి మోహన్ సింగ్ (68) ఆదివారం ఉదయం చౌమజ్రా గ్రామ సమీపంలో తన కారును XUV ఢీకొనడంతో మరణించాడు. మోహన్ సింగ్ అతని బంధువులలో ఒకరిని కలవడానికి మొహాలీకి వచ్చాడు. అయితే ఎక్స్యూవీ కారు ఢీకొట్టడంతో మోహన్ సింగ్ మరణించాడు. ఎక్స్యూవీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మూడవ సంఘటన డేరా బస్సీలో జరిగింది. చడియాల గ్రామానికి చెందిన హర్మన్ సింగ్ కారులో వెళ్తుండగా అదుపుతప్పి చెట్టు ఢీకొనడంతో మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్మాన్ వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.