Site icon HashtagU Telugu

Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!

No Pension For Defected Mla

no-pension-for-defected-mlas-in-himachal-pradesh-as-assembly-passes-new-bill

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చ అనంతరం రాష్ట్ర అసెంబ్లీ బుధవారం నాడు ఆమోదించింది.

We’re now on WhatsApp. Click to Join.

హిమచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఏదైనా ఒక సమయంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇక నుంచి పెన్షన్ పొందే వీలుండదని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ, కొందరు (ఎమ్మెల్యేలు) రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పద్ధతులకు పాల్పడుతుంటారనీ, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి ఈ బిల్లు చాలా అవసరమని చెప్పారు. హిమాచల్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్టు తెలిపారు.

దీనికి ముందు ఫిబ్రవరి 29న ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 34కు పడిపోయింది. అయితే ఆ తర్వాత విధానసభ ఉప ఎన్నికల్లో తిరిగి 40 స్థానాలకు కాంగ్రెస్ చేరుకుంది. విపక్ష బీజేపీకి అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

Read Also: CM Chandrababu : వరద ప్రాంతాల్లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు పర్యటన