Site icon HashtagU Telugu

మ‌న్మోహ‌న్‌కు సెల‌వులిచ్చిన వెంక‌య్య‌నాయుడు

Manmohan Venkiah

Manmohan Venkiah

మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్​ మన్మోహన్​ సింగ్​కు సెలవులు మంజూరు చేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గైర్హాజరయ్యేందుకు అనుమతించారు. సెలవులకు సంబంధించిన దరఖాస్తు​ ఛైర్మన్​ టేబుల్​ వద్దకు వచ్చిన తర్వాత ఈ ప్రకటన చేశారు వెంకయ్య.

” డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ నుంచి లేఖ అందింది. అనారోగ్య కారణాలతో శీతాకాల సమావేశాలకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. అందుకు అనుమతిస్తున్నాం. నవంబర్​ 29 నుంచి డిసెంబర్​ 23 వరకు జరుగుతున్న మొత్తం శీతాకాల సమావేశాలకు సెలవులు మంజూరు చేస్తున్నాం. “- వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్​.

89 ఏళ్ల మన్మోహన్​ సింగ్​కు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. గుండె సంబంధింత సమస్యలతో గత అక్టోబర్​లో దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు సింగ్​. అంతకుముందు పలుమార్లు బైపాస్​ సర్జరీలు జరిగాయి.

Exit mobile version