Congress 6th List: 2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు. లోక్సభ స్పీకర్గా కొనసాగుతున్న ఓం బిర్లాపై పోటీ చేసేందుకు కోటా నుంచి ప్రహ్లాద్ గుంజాల్ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. దీంతో ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరిగే లోక్సభ ఎన్నికలకు మొత్తం 190 మంది అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి దామోదర్ గుర్జర్, తిరునల్వేలి నుంచి సీ రాబర్ట్ బ్రూస్ పోటీ చేయనున్నారు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు సన్నిహితుడైన గుంజాల్ గతంలో కోట నార్త్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అతని రాక హదోతి ప్రాంతంలో కాంగ్రెస్కు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు బీజేపీ ఆదివారం 111 మంది అభ్యర్ధులతో 5వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనా రనౌత్, రామాయణ నటుడు అరుణ్ గోవిల్, కలకత్తా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ్, పారిశ్రామిక దిగ్గజం, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ వంటి ప్రముఖులకు అవకాశం కల్పించింది.
Also Read: RCB vs PBKS Prediction: సొంతగడ్డపై ఆర్సీబీ సత్తా చాటుతుందా? పంజాబ్ దే పైచేయి