Kedarnath : నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. తెరుచుకున్న ఆలయ ద్వారాలు..

ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు నేడు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్‌నాథ్ ఆలయం నేడు ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సుమారు 51 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు స్వాగతం పలికింది. స్వామి వారి సందర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు, రేపు విష్ణుమూర్తి నివాసమైన […]

Published By: HashtagU Telugu Desk
Kedarnath Temple opens for devotees

Kedarnath Temple opens for devotees

ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్‌లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్‌నాథ్ ధామం తలుపులు నేడు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్‌నాథ్ ఆలయం నేడు ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సుమారు 51 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించిన ఈ పుణ్యక్షేత్రం భక్తులకు స్వాగతం పలికింది. స్వామి వారి సందర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు, రేపు విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ X వేదికగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశాన్ని ఇచ్చారు. చార్‌ధామ్ యాత్ర మన దేశ విశ్వాసానికి, ఐక్యతకు మరియు సుసంపన్నమైన సంప్రదాయాలకు దివ్య ఉత్సవం వంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి యాత్ర సుఖమయంగా సాగాలని, బాబా కేదార్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

  Last Updated: 22 Apr 2026, 11:48 AM IST