Site icon HashtagU Telugu

Kashmir : కశ్మీర్ కు తీవ్ర ముప్పు పొంచివుందా?

Kashmir May See 'drought'

Kashmir May See 'drought'

జమ్మూకశ్మీర్ (Kashmir ) తీవ్ర కరువు ముప్పుపొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడచిన మూడు నెలల్లో వర్షపాతం (Dry Winter) సగటుతో పోల్చితే 80 శాతం మేర తగ్గిపోయిందని వెల్లడించింది. ఈ స్థాయిలో అనావృష్టి కశ్మీర్‌లో చాలా అరుదుగా కనిపిస్తుందని, ఇది సముచిత చర్యలు తీసుకోవాల్సిన సమయం అని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఇది వ్యవసాయ రంగానికి పెద్ద సవాలు అని అధికారులు (MeT Department) పేర్కొన్నారు.

AP Budget : రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?

ఈ కరువు ప్రభావం కేవలం వ్యవసాయం మీదనే కాకుండా, నదీజలాల లభ్యతపై కూడా తీవ్రంగా పడింది. జలవనరుల సమృద్ధిగా ఉండే కశ్మీర్‌లో నదుల నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయిందని, ఇది ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తాగునీటి సంక్షోభం, సాగునీటి కొరతతో రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు అందాయి.

Pawan : ఏపీకి పవన్‌ కల్యాణ్‌ ఆశాజ్యోతి – ఉండవల్లి అరుణ్ కుమార్

అయితే, ఈ నెలలో మరో రెండు సార్లు వర్షపాతం నమోదైతే, పరిస్థితి కొంత మెరుగుపడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హిమపాతం, వర్షపాతం పెరిగితే నీటి మట్టం మెరుగుపడే అవకాశముందని, దీంతో కరువు ప్రభావం కొంత అదుపులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని, ప్రజలకు తగిన సాయం అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద, వర్షాభావ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.