man says wife beats: భార్య కొడుతోందని ప్రధానికి ఫిర్యాదు.!

తన భార్య కొడుతూ వేధిస్తోందని ఓ వ్యక్తి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాడు.

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 04:22 PM IST

తన భార్య కొడుతూ వేధిస్తోందని ఓ వ్యక్తి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాడు. బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ట్యాగ్ చేశాడు. ‘‘నా భార్య కొడుతూ కత్తితో దాడి చేసింది. మీరంటున్న నారీ శక్తి ఇదేనా? ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదు కదా!’’ అని ట్వీట్ చేశారు.

తనను నిత్యం కొడుతున్న భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కర్ణాటక వ్యక్తి ప్రధాని (పీఎంవో) కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ వ్యక్తి ఆరోపించాడు. బెంగుళూరుకు చెందిన యదునందన్ ఆచార్య సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు తన ఫిర్యాదులను పంపారు. అతను తన ట్వీట్‌ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేశాడు. “నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఇది జరిగినప్పుడు ఎవరైనా నాకు సహాయం చేశారా? లేదు. ఎందుకంటే నేను మనిషిని! అంటూ ట్వీట్ చేశాడు. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదా అని ట్వీట్ చేశాడు.

తన భార్య చేసిన కత్తిపోటుతో తన చేతి నుండి రక్తం కారుతున్నట్లు కూడా పేర్కొన్నాడు. అతని ట్వీట్‌పై బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్‌ కు వచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతని ఫిర్యాదును పరిష్కరిస్తామని తెలిపారు.