Lord Jagannath : సుఖోయ్‌ ఫైటర్‌ జెట్‌ టైర్లపై జగన్నాథుడి రథయాత్ర.. ఇస్కాన్‌ వినూత్న నిర్ణయం..!

గత ఏడాది రథానికి ఉపయోగించే పాత టైర్లలో దెబ్బలు తగిలి, రథయాత్ర సురక్షితంగా నిర్వహించడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, కోల్‌కతా ఇస్కాన్‌ ప్రతినిధి రాధారమన్‌ దాస్‌ నేతృత్వంలో నిర్వాహకులు రథానికి మళ్లీ విమాన టైర్లను తీసుకురావాలని నిర్ణయించారు.

Published By: HashtagU Telugu Desk
Jagannath chariot procession on Sukhoi fighter jet tires.. ISKCON innovative decision..!

Jagannath chariot procession on Sukhoi fighter jet tires.. ISKCON innovative decision..!

Lord Jagannath : జగన్నాథ స్వామివారి రథానికి వినూత్నంగా తయారు చేసిన టైర్లు ఇప్పుడు దేశరక్షణలో కీలకమైన సుఖోయ్‌-30 యుద్ధవిమానం కోసం ఉపయోగించే వాటే కావడం విశేషం. ఈ విషయాన్ని కోల్‌కతాలోని జగన్నాథ మందిరాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్‌ సంస్థ అధికారికంగా వెల్లడించింది. గతంలో ఈ ఆలయ రథానికి బోయింగ్‌ విమాన టైర్లు ఉపయోగించేవారు. అయితే, గత పదిహేనేళ్లుగా వాటిని కొనుగోలు చేయడం ఇస్కాన్‌కు సాధ్యం కాలేదు. దీంతో టైర్ల కొనుగోలు సమస్య తీవ్రంగా మారింది. గత ఏడాది రథానికి ఉపయోగించే పాత టైర్లలో దెబ్బలు తగిలి, రథయాత్ర సురక్షితంగా నిర్వహించడంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, కోల్‌కతా ఇస్కాన్‌ ప్రతినిధి రాధారమన్‌ దాస్‌ నేతృత్వంలో నిర్వాహకులు రథానికి మళ్లీ విమాన టైర్లను తీసుకురావాలని నిర్ణయించారు.

Read Also: Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి

అయితే, ఈసారి మరింత శక్తివంతమైనవి కావాలని భావించి, భారత వైమానిక దళంలో ఉన్న అత్యాధునిక ఫైటర్‌ జెట్‌ సుఖోయ్‌-30కి వాడే టైర్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాధారమన్‌ దాస్‌ మాట్లాడుతూ..మేము ఆ టైర్లను తయారు చేసే సంస్థకు ఆర్డర్‌ ఇచ్చాం. వారు మొదటగా ఆశ్చర్యపోయారు. దేవాలయం రథానికి యుద్ధవిమాన టైర్లెందుకు అని అడిగారు. ఆపై మా అవసరాన్ని వివరించి, వారిని ఆలయానికి ఆహ్వానించాము. వారు వచ్చి పరిశీలించి నాలుగు టైర్లు ఇవ్వడానికి అంగీకరించారు అని తెలిపారు.ఈ టైర్లు ఇప్పుడు స్వామివారి రథానికి అమర్చే పనులు ప్రారంభమయ్యాయి. రథానికి ఇది ఓ కొత్త ఊపిరిగా మారనుంది. 48 ఏళ్ల తర్వాత తొలిసారి రథానికి కొత్త చక్రాలు లభించడం ఇది. ఈ టైర్లు అధిక బరువు, వేగాన్ని తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉండడంతో భద్రతా పరంగా ఎంతో అనుకూలం.

సుఖోయ్‌-30 టైర్లు గరిష్టంగా గంటకు 280 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలవు. అయితే, జగన్నాథ రథయాత్రలో రథం గంటకు సగటుగా 1.4 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీంతో, రథయాత్ర సమయంలో రథం సుశ్రద్ధగా, సురక్షితంగా నడవడానికి ఈ టైర్లు మరింత బలాన్నిస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్కాన్‌ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం సామాన్య భక్తులను మాత్రమే కాకుండా, సామాజిక మాధ్యమాల్లోనూ విశేష ఆసక్తి రేపుతోంది. భారత వైమానిక దళం పటుత్వాన్ని ఆధ్యాత్మిక రీతిలో అనుసంధానం చేసిన ఈ రథచక్రాలు, దేశసేవలోని శక్తిని దేవతారాధనతో ముడిపెట్టే అరుదైన ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Read Also: AP : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభం..

 

  Last Updated: 01 Jun 2025, 12:36 PM IST