Site icon HashtagU Telugu

IT Refund: ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ హెచ్చరికలు..పొరపాటున కూడా ఆ మెసేజ్ లను నమ్మకండి

It Returns

It Returns

ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (IT Returns) దాఖలులో ప్రజల శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో, రీఫండ్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. అయితే ఇదే అవకాశంగా చూసుకుని సైబర్ నేరగాళ్లు తమ కుట్రలు కొనసాగిస్తున్నారు. రీఫండ్ వస్తుందని నమ్మబలికే ఫేక్ మెసేజ్‌లు, ఈమెయిళ్లు పంపిస్తూ బ్యాంక్ వివరాలు, ఓటీపీ లాంటి వ్యక్తిగత సమాచారం దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్ పేయర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ కడపటిగా హెచ్చరిస్తోంది.

ఐటీ శాఖ ప్రకారం.. ఎవరైనా రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని పంపుతున్నట్టు చెప్పి మీకు మెసేజ్ లేదా ఈమెయిల్ పంపితే, అది నిజమైనదా కాదా అన్నదాన్ని గమనించడం అత్యవసరం. ప్రత్యేకంగా అటువంటి మెసేజ్‌ల్లో లింకులు ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదని సూచిస్తోంది. ఎందుకంటే అలా లింకులు ఓపెన్ చేసి, వాటిలో మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ లాంటివి ఎంటర్ చేస్తే మీ ఖాతాలో ఉన్న మొత్తం మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

RS Praveen : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కొత్త చిక్కు..?

ఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా తెలిపినట్టు, రీఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారానే అందుబాటులో ఉంటాయి. ఐటీ శాఖ ఎప్పుడూ ఈమెయిల్ లేదా మెసేజ్ రూపంలో వ్యక్తిగత సమాచారం అడగదు. అందువల్ల ఎలాంటి సందేహాస్పద మెసేజ్ వచ్చినా ముందుగా దాని స్థిరతను ధృవీకరించుకోవాలి. మీరు అసలైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలి.

ఇక తప్పుడు క్లెయిమ్స్‌ ద్వారా రీఫండ్ పొందిన వారిపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఇప్పటికే రూ.1000 కోట్ల మేరకు బోగస్ క్లెయిమ్స్‌ కేసులు బయటపడగా, అందులో 40 వేల మంది సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు తాము చేసిన తప్పును సరిచేసేందుకు అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయాలని సూచిస్తోంది. స్వచ్ఛందంగా ముందుకు రాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది.

Read Also : Telangana Politics : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలలో కాకరేపుతున్న అసమ్మతి సెగలు