Site icon HashtagU Telugu

Terrorists Hunt : నలుగురు ఉగ్రవాదుల వేట.. లొకేషన్‌‌‌పై కీలక అప్‌డేట్

Pahalgam Attack

Pahalgam Attack

Terrorists Hunt : పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను భారత సైన్యం నాలుగుసార్లు ట్రాక్‌ చేసింది. దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో వాళ్లు నక్కి ఉన్నట్లు గుర్తించారు.  ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకున్నప్పటికీ..  కొద్దిపాటి వ్యవధిలో ముష్కర మూకలు తప్పించుకోగలిగారు. కూంబింగ్ జరుపుతున్న క్రమంలో ఒకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల(Terrorists Hunt) మధ్య ఫైరింగ్ కూడా జరిగిందని తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులకు అత్యంత దగ్గరగా భారత భద్రతా బలగాలు వెళ్లాయని సమాచారం. కశ్మీరులోని స్థానికులు, ఇంటెలీజెన్స్ సిబ్బంది ఇస్తున్న సమాచారం వల్లే ఈ ట్రాకింగ్ సాధ్యమైందని అంటున్నారు.  ‘‘ఉగ్రవాదులను మేం పట్టుకొని తీరుతాం. ఆర్మీ సిబ్బంది కనుచూపు మేరలో కనిపించగానే .. ఉగ్రమూకలు కాల్పులు జరిపి తప్పించుకుంటున్నారు. దక్షిణ కశ్మీరు అడవులు చిక్కగా ఉండటంతో ఉగ్రవాదులను పట్టుకోవడం పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతం  ఎలుకా పిల్లి ఆటలా ఉగ్రవాదుల వేట సాగుతోంది’’ అని ఓ సైనిక అధికారి మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలను బట్టి పిల్లి పాత్రలో బలమైన భారత సైన్యమే ఉంది. ఎలుకల్లాంటి ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేయడం ఖాయమనే కోణంలో ఈ వ్యాఖ్యానం ఉంది. నేడో, రేపో మన ముందుకు నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ వార్త రావొచ్చు.

Also Read :Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?

ఉగ్రవాదుల లొకేషన్లు ఇవీ.. 

Also Read :Rapido Food Delivery : ‘ర్యాపిడో’ ఫుడ్‌ డెలివరీ.. కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ