Site icon HashtagU Telugu

Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?

Rice Consumption In Indian States Hces Survey Report Household Consumption Milk Vegetables

Rice Consumption : మనదేశంలోని ఒక్కో రాష్ట్రం ప్రజలకు ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ప్రధాన ఆహారంగా ఉంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో బియ్యం ప్రధాన ఆహారం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రజల నెలవారీ తలసరి బియ్యం వినియోగం ఒక కేజీ కూడా ఉండదట. . ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం సర్వే: 2023-24’ నివేదికలో ప్రస్తావించారు. అక్కడి ప్రజలు ప్రధాన ఆహార వనరుగా గోధుమలను వినియోగిస్తున్నారు. రోజూ మూడు పూటలా చపాతీలే తినడానికి వాళ్లు ప్రయారిటీ ఇస్తారు.  పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో గోధుమ సాగు ఎక్కువ. దీనివల్ల అక్కడ అది తక్కువ రేటుకే లభిస్తుంది.

Also Read :100 Years For Electric Train : మన తొలి విద్యుత్‌ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ

తెలుగు రాష్ట్రాల్లో..

Also Read :ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్‌వీఎస్‌-02’ శాటిలైట్‌

సాధారణ తరహా బియ్యం రేటు ప్రస్తుతం సగటున రూ.45కుపైనే ఉంది. సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది. మొత్తం మీద బియ్యమే ఎక్కువ ధరతో వస్తుంది. గోధుమలను కొన్న తర్వాత వాటిని పిండిగా మార్చుకోవడానికి ఇంకొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ధరతో సంబంధం లేకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వారివారి సాంప్రదాయక ఆహారపు అలవాట్ల ప్రకారం బియ్యం తిన్నాలా ? గోధుమలు తినాలా ? అనేది డిసైడ్ చేసుకుంటారు.