Rajastan : దారుణం…ఓ జంట ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణ హత్య..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 09:41 AM IST

రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నిర్జన ప్రదేశంలో రెండు శవాలు లభ్యమయ్యాయి. ఉదయ్ పూర్ లోని గోగుండా పీఎస్ పరిధిలో ఈ జంట శవాలను పోలీసులు గుర్తించారు. పరువు హత్యా లేకా శత్రువుల దాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ జంటను గుర్తించిను పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రాహుల్ మీనా ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఇంకోరు సోను సింగ్ గా గుర్తించారు. రాహుల్ దళితుడు. సోనూ రాజ్ పుత్ కమ్యూనిటీ చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు కూడా పదికిలోమీటర్ల దూరంలో ఉన్న వేరు వేరు గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. వీరిని రాళ్లతో కొట్టి చంపారు. తర్వాత పదునైన ఆయుధంతో పొడిచిపంచిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే మీనా జననాంగాలు కోసేశారు. సోనూ ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు ఉన్నాయి. రెండు రోజుల కిందట ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి కులం పరంగా చూసినట్లయితే ఇది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు.