Site icon HashtagU Telugu

Emergency Alert : మీ ఫోన్ కు ”ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్” వచ్చిందా..?

Emergency Alert Message

Emergency Alert Message

కొద్దీ సేపటి క్రితం(గురువారం) దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఫోన్లకు ‘Emergency Alert ‘ అనే మెసేజ్ రావడం తో అంత ఖంగారుకు లోనయ్యారు. ఏంటి ఇలా మెసేజ్ వచ్చింది..ఏంటి ఇది..? ఎవరు పంపించారు..? నాకు ఎందుకు పంపించారు..? దీని అర్ధం ఏంటి..? ఏం జరగబోతుంది..? అని అంత షాక్ అవుతూ..ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ మెసేజ్ పంపింది కేంద్ర ప్రభుత్వమే.

ఎమర్జెన్సీ సిస్టం అలర్ట్ టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ ను పంపించారు. భూకంపాలు, సునామీ, వరదలు సహా పలు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను కాపాడేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తో కలిసి కేంద్రం ఈ ‘Emergency Alert ‘ ను నిర్వహించింది. ఇందులో భాగంగా గురువారం 11 : 30 – 12 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో లతో పాటు దేశ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికీ ‘Emergency Alert ‘ మెసేజ్ ను పంపించారు.

భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్ పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ ను ఇప్పటికే రెండుసార్లు పరీక్షించగా, మూడో టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ పంపించినట్లు వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఇలాంటి మెసేజ్ పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈరోజు (గురువారం) మధ్యాహ్నం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మెసేజ్ సెంట్ చేసినట్లు తెలిపింది. చాలామంది ఈ మెసేజ్ ను చూసి ఖంగారుకు గురయ్యారు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వమే పంపించింది తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

అలర్ట్ మెసేజ్ (Emergency Alert Message) లో ఏం ఉందంటే..

“ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపబడిన శాంపిల్ టెస్ట్ మెసేజ్. దయచేసి ఈ మెసేజ్ ను వదిలేయండి. మీ నుంచి ఎలాంటి యాక్షన్ అవసరం లేదు. ఈ మెసేజ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ TEST Pan-India ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ నుంచి పంపించబడింది. ఇది ప్రజల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర సమయాల్లో సకాలంలో హెచ్చరికలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది” అని ఫ్లాష్ మెసేజ్ కనిపించింది.