హోలీ (Holi) పండగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు (Central government employees and pensioners) ఎన్డీఏ సర్కార్ గుడ్ (NDA GOVT) న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ ఈరోజు సమావేశమై డియర్ నెస్ అలవెన్స్ (DA), డియర్ నెస్ రిలీఫ్ (DR) పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పెంపుతో దాదాపు 1.2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలిగే అవకాశం ఉంది. గతంలో కూడా కేంద్రం పలు దఫాలుగా DA, DR పెంచుతూ ఉద్యోగులకు ఊరట కల్పించింది.
Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక
గతేడాది జులైలో కేంద్ర ప్రభుత్వం DAను 50% నుంచి 53%కి పెంచింది. అయితే తాజా అంచనాల ప్రకారం ఈసారి కనీసం 2% పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరింత పెరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెంపు అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
Telangana BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్గా ఈటల రాజేందర్..అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్
DA, DR పెంపుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ నిర్ణయాన్ని ఆశావహంగా ఎదురుచూస్తున్నాయి. ప్రతి సంవత్సరం రెండుసార్లు DAను సమీక్షించే విధానం ఉన్నప్పటికీ, ఈసారి హోలీ పండగను పురస్కరించుకుని కేంద్రం ముందస్తుగా ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ పెంపు అమల్లోకి వస్తే, ఉద్యోగుల నిత్యావసరాల కొనుగోలుపై ఒత్తిడి కొంతవరకు తగ్గనుంది. ఇక అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.