Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.53,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,420గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 08:23 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.53,550గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,420గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 72,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మార్చి 17, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.58,570గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.58,420 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,420గా ఉంది.

Also Read: Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 69,200 ఉండగా, ముంబైలో రూ.69,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.69,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, విజయవాడలో రూ.72,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.