Gold And Silver Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,890గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - March 12, 2023 / 08:10 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,890గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 68,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మార్చి 12, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,040గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,700 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.56,890 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,890గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,940గా ఉంది.

Also Read: Rudram Namaka, Chamakam: రుద్రం నమకం, చమకం యొక్క విశిష్టత..

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,700 ఉండగా, ముంబైలో రూ.65,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కోల్‌కతాలో రూ.65,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కేరళలో రూ.68,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, విజయవాడలో రూ.68,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.