కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శనివారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,400గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,070గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 67,300 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (మార్చి 11, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.56,210గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.51,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,620గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.56,070 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,070గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,110గా ఉంది.
Also Read: Samsung Galaxy M14 5G: మార్కెట్ లోకి మరో కొత్త శాంసంగ్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,250 ఉండగా, ముంబైలో రూ.65,250గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, కోల్కతాలో రూ.65,250గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, కేరళలో రూ.67,300గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,300 ఉండగా, విజయవాడలో రూ.67,300 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.