Riya Sen With Rahul Gandhi: భారత్ జోడోలో గ్లామర్ షో.. రాహుల్ తో రియాసేన్!

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటూ

  • Written By:
  • Updated On - November 17, 2022 / 01:14 PM IST

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటూ రాహుల్ తో కలిసి అడుగుల్లో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ యాత్రలో గ్లామర్ షో హుషారెత్తిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ పూనమ్ కౌర్, పూజా భట్ లు రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో నటి రాహుల్ పక్కన కనిపించి జోష్ నింపింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో జరుగుతున్న విషయం తెలిసిందే. రియాసేన్ రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేశారు. జనాలకు అభివాదం చేస్తూ, రాహుల్ తో ముచ్చటిస్తూ ప్రత్యేకార్షణగా నిలిచారు. రాహుల్‌తో పాటు ఆమె నడిచిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో పూజా భట్ హైదరాబాద్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ ను కలుసుకొని తన మద్దతును తెలిపారు. రియా సేన్ మహారాష్ట్రలోని అకోలాలో పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా ‘‘భారత్ జోడో భావితరాలకు ధైర్యం’’ అని పూజ భట్ పేర్కొన్న విషయం తెలిసిందే.