Site icon HashtagU Telugu

Maoists Encounter : అబూజ్‌మడ్‌లో మరో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

IED Blast

IED Blast

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌‌ రాష్ట్రంలోని బస్తర్‌ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట. ప్రస్తుతం అది బీటలు బారుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి నారాయణ్‌పూర్‌- దంతెవాడ జిల్లాల బార్డర్‌లోని అడవుల్లో  భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన ప్రతి కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్‌ కానిస్టేబుల్‌ కరమ్‌  అమరుడయ్యారు.

Also Read :OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్

అబూజ్ మడ్‌లోని అడవుల్లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్త సెర్చ్  ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. వారు భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాల ప్రతికాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.  ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టులకు చెందిన ఏకే 47 రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ వంటి ఆటోమెటిక్ ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు(Maoists Encounter) వెల్లడించారు.

Also Read :Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి