Earthquake: పలుచోట్ల భూ ప్రకంపనలు.. వారం వ్యవధిలో ఢిల్లీలో రెండోసారి

దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని పలుప్రాంతాలలో గురువారం రాత్రి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని పలుప్రాంతాలలో గురువారం రాత్రి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిన తర్వాత ఉత్తర భారతదేశంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూ ఉపరితలం నుంచి 200కి.మీ. లోతులో దీని తీవ్రత కేంద్రీకృతమై ఉన్నట్టు సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్టు సమాచారం.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గురువారం భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూమి కంపించడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతం భూకంప కేంద్రం. అదే సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రాత్రి 7.55 గంటలకు భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణంగా 79 కిలోమీటర్ల దూరంలో 200 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.

Also Read: 3 Children Die: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. మీజిల్స్‌తో ముగ్గురు చిన్నారులు మృతి

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందలేదు. ఢిల్లీలో వారం వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. అంతకుముంద, కొత్త సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1న హర్యానాలోని ఝజ్జర్‌లో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీని ప్రకంపనలు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కూడా కనిపించాయి.

గురువారం ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా, ఢిల్లీతో సహా అనేక ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణంగా 79 కి.మీ దూరంలో 200 కి.మీ లోతులో ఉంది. అంతకముందు నవంబర్ 2022లో కూడా ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో భూకంప కేంద్రం నేపాల్‌. భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో దీని ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ.. నవంబర్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది.

  Last Updated: 06 Jan 2023, 07:31 AM IST