Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మూత్రం తాగించి అవమానం..!

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 09:56 PM IST

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో తాను చేసిన పనికి డబ్బులు చెల్లించాలని కోరిన ఓ దళిత వ్యక్తిని కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసిన అవమానించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. భరత్ కుమార్ అనే వ్యక్తి ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పనులు చేస్తుంటాడు. ఓ పని చేసినందుకు గానూ రూ.21,000 బిల్లు చేశాడు. బాధితుడు భరత్ కుమార్ జులావా (35)పై దాడి చేసి బూట్లతో దండలు వేసినందుకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు.

సదరు యజమాని ముందుగా రూ.5000 చెల్లించాడు. మిగతావి ఇవ్వాలని కోరగా, అదే రోజు రాత్రి రమ్మని కోరాడు. చెప్పిన సమయానికి వెళ్లగా తనపై దారుణంగా దాడి చేసి, మూత్రం తాగించి, చెప్పులు మెడలో వేసి అవమానించినట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

బాధితుడు భరత్ కుమార్ జులావా (35)పై దాడి చేసి బూట్లతో దండ వేసినందుకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. ఈ మేరకు నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.