వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమైంది. ఇప్పటికే మూడు జాబితాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇప్పటివరకు 104 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నవంబర్ 4న కాంగ్రెస్ తన తొలి జాబితాను ప్రకటించింది. అందులో 43 మంది అభ్యర్థులను ప్రకటించారు. 46 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను నవంబర్ 10న ప్రకటించారు. శుక్రవారం ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
నాల్గవ జాబితాలో ద్వారక నుంచి మలుభాయ్ కండోరియా, తలాలా నుంచి మన్సిన్ దోడియా, కోడినార్ ఎస్సీ నుంచి మహేశ్ మక్వానా, భావ్నగర్ రూరల్ నుంచి రేవత్సిన్హ్ గోహిల్, భావ్నగర్ తూర్పు నుంచి బల్దేవ్ మజీభాయ్ సోలంకీ అభ్యర్థులుగా ఉన్నారు. . జాబితాలోని ఇతర అభ్యర్థులలో బొటాడ్ నుండి రమేష్ మెర్, జంబూసర్ నుండి సంజయ్ సోలంకి, భరూచ్ నుండి జయకాంత్ భాయ్ బి పటేల్ మరియు ధరంపూర్ ST నుండి కిషన్భాయ్ వేస్తాభాయ్ పటేల్ ఉన్నారు. విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో మమద్భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా), రాజేందర్సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా – ఎస్సీ), కల్పనా కరంసిభాయ్ మక్వానా (లింబ్డీ) ఉన్నారు. లింబ్డీ నుంచి కల్పనా కరంసీభాయ్ మక్వానా, దేడియాపాడ-ఎస్టీ నుంచి జెర్మాబెన్ సుఖ్లాల్ వాసవా, కరంజ్ నుంచి భారతీ ప్రకాష్ పటేల్లతో కూడిన మొత్తం ముగ్గురు మహిళా నేతలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.