బాంబే హైకోర్టు (High Court of Bombay) తాజాగా ఒక కీలకమైన మరియు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఒక మహిళ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా, తన మాజీ భర్త నుంచి నెలకు రూ.లక్ష భరణం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. అయితే హైకోర్టు మాత్రం ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆమె తీరును ‘క్రూరత్వం’గా పరిగణిస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించింది.
Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్
ఈ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు, సదరు వివాహిత భర్తతో శృంగారానికి నిరాకరించడం, అతడిపై అవాస్తవ ఆరోపణలు చేయడం వంటి చర్యలు కుటుంబ జీవితాన్ని భగ్నం చేసే క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది. తన భర్తకు వివాహేతర సంబంధాలున్నాయని నిరాధారంగా అనుమానించడం కూడా ఓ రకంగా అతడిని అవమానించినట్లే అని కోర్టు అభిప్రాయపడింది. ఇది భర్తకు మానసిక వేధింపుగా మారిందని పేర్కొంది.
అదే సమయంలో విడాకులు మంజూరైన నేపథ్యంలో, ఆమెకు భరణం లభించదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆమె హక్కుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పు ద్వారా భారతీయ దంపతుల మధ్య బాధ్యత, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో హైకోర్టు పునఃస్మరణ కలిగించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాహ పరమైన న్యాయమూల్యాలకు సంబంధించి చర్చకు దారితీయనుంది.
Rishabh Pant: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. నాల్గవ టెస్ట్కు పంత్ దూరం?!