Operation Sindoor : భారత వాయుసేన (IAF)’ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన రహస్య ఆపరేషన్కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో భారత సైన్యం అభूतపూర్వ విజయాన్ని సాధించింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’కు ఆమోదం లభించింది. ఈ ఆపరేషన్ను భారత వాయుసేన మే 7న ప్రారంభించింది. ప్రారంభ దశలో పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విమానదాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో వాయుసేన యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతికతతో శత్రు స్థావరాలపై కచ్చితమైన బాంబుల వర్షం కురిపించాయి. వీడియోలో చూపిన ప్రకారం, ఈ దాడులు చాలా సమర్థవంతంగా జరిగాయి.
Read Also: Sanju Samson: సంజూ సామ్సన్ MS ధోనీకి సరైన ప్రత్యామ్నాయం: శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
భారత దాడికి ప్రతిగా పాకిస్థాన్ వైపు నుంచి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగాయి. అయితే భారత భద్రతా దళాలు వాటిని సమర్థవంతంగా అడ్డగించడమే కాకుండా, ఎదురుదాడులు కూడా చేపట్టాయి. ఈ క్రమంలో భారత వాయుసేన పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై మరింత తీవ్రమైన దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐదు పాక్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఘట్టంగా, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక భారీ విమానాన్ని ఉపరితల నుండి ప్రయోగించిన క్షిపణితో కూల్చివేయడం చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నమోదైంది. ఈ విజయాన్ని శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ స్వయంగా ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ..ఈ ఆపరేషన్లో భారత వాయుసేన ప్రదర్శించిన సామర్థ్యం ప్రపంచస్థాయిలో ప్రశంసనీయమైనది. ఇది ఉపరితలం నుంచి గగనతలంలో విజయవంతంగా జరిపిన దాడుల్లోనే అత్యుత్తమమైన విజయం” అని పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడిలో ఒక భారీ విమానం, ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది.
Indian Air Force -Touch the Sky with Glory#IndianAirForce#YearOfDefenceReforms@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia@indiannavy@CareerinIAF pic.twitter.com/FhFa3h8yje
— Indian Air Force (@IAF_MCC) August 10, 2025
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు వంటి ఘట్టాలను స్పష్టంగా చూపించారు. ఈ వీడియో ద్వారా ఆపరేషన్కు సంబంధించిన వివరాలు ప్రజల్లోకి వచ్చాయి. మొత్తంగా చూస్తే, ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది భారత సైనిక శక్తిని, నిర్ణయం తీసుకునే వేగాన్ని, టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. 2025 మే 10న కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించడం ద్వారా, పరిస్థితులు తాత్కాలికంగా శాంతియుతంగా మారాయి. కానీ ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తాను ఉగ్రవాదానికి ఎదురైన ప్రతీకార శక్తిగా నిలుస్తుందనే సందేశాన్ని ఇచ్చింది.
Read Also: Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల