మామూలుగా స్త్రీలు కడుపుతో ఉన్నప్పుడు అనేక రకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా పులుపు ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పులుపు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు లేదా మామిడి కాయ. అయితే ప్రెగ్నెన్సీ స్త్రీలు అసలు మామిడి పండ్లను తినవచ్చో,తినకూడదో ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ఎండాకాలంలో మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. తాజా మామిడి పండ్లు చూస్తుంటే ఎవరికైనా సరే నోరూరిపోవాల్సిందే.
ఇక గర్భిణీలకు సైతం మామిడి పండు తినేలనే కోరిక కలగడం చాలా సహజం. కడుపుతో ఉన్నప్పుడు మామిడి తినకూడదని, వేడి చేస్తుందని బిడ్డకు సమస్య కలుగుతుందని చాలా మంది నమ్ముతుంటారు. మరి ఈ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక చిన్న కప్పు మామిడి ముక్కలు రోజూ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ సీ అందుతుంది.
ఇక విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచడానికి, కడుపులో బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా మారడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మామిడి పండులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండు తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ రోగనిరోధక శక్తి కోసం ఏవైనా ఇన్ఫెక్షన్లు, డయేరియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటీయంట్స్, ఎనర్జీని అందిస్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎలాంటి సందేహం లేకుండా మామిడి పండుని తినవచ్చని చెబుతున్నారు. అయితే ఆరోగ్యానికి మంచిదే కదా తినమన్నారు కదా అని ఎలా పడితే అలా ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు. రోజుకు కేవలం అర్థం మామిడికాయ మాత్రమే తినాలని చెబుతున్నారు.
మరీ ఎక్కువగా తినడం వల్ల మీరు నిర్జలీకరణం,విరేచనాలను ఎదుర్కోవలసి ఉంటుందట. గర్భధారణ సమయంలో విరోచనాలు వాంతులు వంటివి ఎక్కువగా కావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆల్రెడీ మధుమేహం అధిక బరువు ఉన్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. మామిడి అనేది పోషకాలతో నిండిన పండు, ఇది శిశువు ఆరోగ్యకరమైన అభివృద్ధిని నిర్ధారిస్తుంది. తల్లికీ, బిడ్డకు మేలు చేస్తుంది. అయితే అతిగా తినకుండా మితంగా తింటే ఈ పండు కడుపులో బిడ్డ ఆరోగ్యంపై అద్భుతాలు చేస్తుందని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.