మోసంబి.. వీటిని చీని కాయలు లేదా బత్తాయి కాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. సిట్రస్ జాతికి చెందిన ఈ మోసంబి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్లో ఏడాది పొడవునా ఈ కాయలు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది వీటిని జ్యూస్ తీసుకొని తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి,కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అంతేకాదు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇలాంటి పండు జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చట. ఇకపోతే బాగా సీజన్ ఉన్నప్పుడు కొంతమంది వీటిని ఎక్కువ మొత్తంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు జ్యూస్ లు తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. మరి ప్రతిరోజు మోసంబి జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారికి మోసం
బిలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట.
ఈ పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే మోసంబి జ్యూస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలట. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లను తక్కువగా తాగడం నుంచి ఫైబర్ ను తీసుకోకపోవడం వరకు మలబద్దకానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే మోసంబి జ్యూస్ ను తరచుగా తాగితే మలబద్దకం సమస్య ఇట్టే తగ్గిపోతుందట. అంతేకాదు ఈ పండులో ఉండే యాసిడ్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయట. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. అలాగే ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగితే మనం ఎన్నో అంటు వ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు.