Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం

Vemulawada : ఆలయానికి భక్తులు కోడె మొక్కులు చెల్లించేందుకు భారీగా వచ్చి కోడెలను సమర్పిస్తుంటారు. ఇవి ఆలయానికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నా, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కోడెల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది

Published By: HashtagU Telugu Desk
Vemulawada Cowshed

Vemulawada Cowshed

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (Vemulawada Sri Rajarajeshwari temple) ఆలయ గోశాలలో కోడెల మృతి (Cow dies in Goshala) ఘటనలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఒక్క రోజులో ఎనిమిది కోడెల మరణించడం గోశాలలో ఏర్పడిన సమస్యల తీవ్రతను వెల్లడించింది. ఆలయానికి భక్తులు కోడె మొక్కులు చెల్లించేందుకు భారీగా వచ్చి కోడెలను సమర్పిస్తుంటారు. ఇవి ఆలయానికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నా, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కోడెల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

Samantha : మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేదు – సమంత

రాజన్న గోశాలలో ప్రస్తుతం 500 కోడెలకు మాత్రమే ఏర్పాట్లు ఉండగా, దాని కంటే రెండింతలకుపైగా అంటే 1200కిపైగా కోడెలు ఉంచబడి ఉన్నాయి. తగినంత సిబ్బంది లేకపోవడం, వర్షాలతో గోశాల ప్రాంగణం పూర్తిగా బురదగా మారడం, డ్రైనేజీ సదుపాయం లేకపోవడం వల్ల కోడెలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నాయి. ప్రాంగణంలో చోటుచేసుకుంటున్న తొక్కిసలాట కూడా మరణాలకు కారణమవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సంఘటనలపై స్పందించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెంటనే వెటర్నరీ సిబ్బందిని గోశాలకు పంపించారు. ఐదుగురు సభ్యుల వైద్య బృందం గోశాలను పరిశీలించి పరిస్థితులపై నివేదిక సమర్పించింది. కోడెల మృతిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, శుభ్రత, డ్రైనేజీ, పోషకాహారం వంటి అంశాల్లో మెరుగుదల అవసరమని వారు సూచించారు. బక్రీద్ పండుగ అనంతరం రైతులకు కోడెల పంపిణీని పునఃప్రారంభించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. ఈ ఘటనను బట్టి దేవాదాయ శాఖ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 31 May 2025, 01:38 PM IST