Tirumala : ఇక నుంచి తిరుమల దాతలు స్వయంగా భక్తులకు వడ్డించవచ్చు

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా,

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం కొనసాగిస్తోంది.‌ ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

తిరుమలలో (Tirumala) అన్నప్రసాద విభాగం సేవలు అందుతున్న ప్రాంతాలు

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4( పాత అన్న ప్రసాదం ), పీఏసీ-2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, 2వ సత్రం, 3వ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

ప్రముఖ దినాల్లో 3 లక్షల మందికి పైగా

తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 3లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, సేమ్యా ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో (Tirumala) అన్నప్రసాదాల తయారీకి రోజుకు 14 నుంచి 16.5 టన్నుల బియ్యం, 6.5 నుంచి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు.

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మాదిరిగానే పది రోజుల ముందే మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లు టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. అయితే జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది‌ రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం‌ కల్పచాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుంచి 11వ తారీఖు వరకూ సంబంధించిన టోకెన్లను టీటీడీ‌ జారీ చేసింది. అయితే 12వ తేదీ నుంచి మిగిలిన రోజుల ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లను టీటీడీ పెండింగ్ పెట్టింది. అయితే  జనవరి 12వ తేదీ నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై వేల చొప్పున ఈ‌నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని‌ సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.

Also Read:  Godadevi : భగవంతుడి మనసు గెలిచిన ఓ భక్తురాలి ప్రేమ కథ

ప్రజలకు విజ్ఞప్తి:

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ కోటా ఆదివారంతో ముగియటంతో… జనవరి 12వ తేదీ నుండి ఏ రోజుకు ఆ రోజు ఉచిత దర్శన ఎస్.ఎస్.డి దర్శనాల కేటాయింపు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో మునుపటిలాగానే టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. గదులను ఆన్ లైన్లో బుక్ చేసుకోవటానికి ఆన్ లైన్ గదుల కోటా 12 జనవరి, 2023 నుండి 28 ఫిబ్రవరి, 2023 వరకు బుకింగ్ కోసం జనవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది.

TTD Link: http://tirupatibalaji.ap.gov.in