Sita Ramam: సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హనురాఘవ పూడి దర్శకత్వంలో వచ్చి

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 09:00 AM IST

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హనురాఘవ పూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు కలెక్షన్ల మోత మోగించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన సీతారామం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీతారామం సినిమాలో సీత మహాలక్ష్మీ పాత్రలో చూడచక్కగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే రామ్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు.

మొత్తంగా సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు వేలంటైన్స్ డే సందర్భంగా సీతారామం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మృణాల్ కు తెలుగులో భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ కూడా లభించింది. ఇక ఇప్పుడు ఈ భామ తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే సీతారామం సినిమాను ఒక స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందట. అయితే ముందుగా ఈ సినిమా కథను హీరోయిన్ పూజ హెగ్డే కు వినిపించారట.

అయితే దర్శకుడు హనురాఘవాపుడి ముందుగా సీత పాత్రలో పూజా ను ఎంపిక చేశాడట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేశాడట. అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట. దాంతో ఆ విషయం పట్ల బాగా ఆలోచించినా డైరెక్టర్ కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టారట దర్శకుడు. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట. ఇలా పూజా హెగ్డే సీతారామం సినిమాను మిస్ చేసుకుందట. ఒకవేళ పూజ హెగ్డే కనుక ఈ సినిమాలో హీరోయిన్గా నటించి ఉంటే ఆమె కెరియర్ ఇంకా బాగుండేదేమో. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవడంతో ఆమె కెరియర్ డల్ అయిపోయింది.