గాడ్ ఫాదర్ సక్సెస్తో చిరు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ సినిమాలో సెట్స్ లో ఉండగానే, మరో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఓ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి బాస్ పార్టీ అనే టైటిల్ పెట్టారు.
చిరంజీవి మాస్ అవతార్, DSP వాయిస్ తో ప్రోమో ఎనర్జిటిక్గా ఉంటుంది. ఈ ట్రాక్ మాస్కి ఫీస్ట్గా ఉండబోతోంది. పూర్తి పాటను నవంబర్ 23, 2022 సాయంత్రం 04:35 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.