Vijay Sethupathi: అంచనాలు పెంచేస్తున్న ‘పుష్ప-2’.. సీక్వెల్ లో విజయ్ సేతుపతి యాక్షన్!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

  • Written By:
  • Updated On - July 4, 2022 / 12:49 PM IST

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో ప్రతిఒక్కరి ఫోకస్ పుష్ప సీక్వెల్‌పై పడింది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించినట్లు తాజా సమాచారం. అయితే, ఇప్పటి వరకు విజయ్ సేతుపతి లేదా పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. పార్ట్-1 లో ఎండింగ్ లో పుష్పరాజ్, ఫహద్ ఫాసిల్  భన్వర్ సింగ్ షెకావత్ ఎదురుపడిన సందర్భాలు ఆసక్తి కల్గిస్తాయి. దీంతో ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఒకవేళ విజయ్ సేతుపతి రంగంలోకి దిగితే.. సినిమా నెక్ట్స్ లెవల్ కు వెళ్తుందని చెప్పక తప్పదు. పుష్ప పార్ట్-2 జూలై లేదా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతిని మేకర్స్ సంప్రదించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు మేకర్స్. అయితే, డేట్ సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతితో కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది పుష్ప టీమ్. ఇందుకు సంబంధించిన వార్తపై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రను చంపేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, మేకర్స్ అది పుకారు అని కొట్టిపారేశారు. పుష్ప: రూల్ 2023 వేసవిలో థియేటర్లలోకి రానుంది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే, షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్‌లను మేకర్స్ షేర్ చేయనున్నారు.